EPAPER

Telangana Elections | కాంగ్రెస్‌పై విష ప్రచారం మొదలుపెట్టిన బీఆర్ఎస్ : చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana Elections : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం మొదలుపెట్టిందని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Telangana Elections | కాంగ్రెస్‌పై విష ప్రచారం మొదలుపెట్టిన బీఆర్ఎస్ : చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana Elections : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం మొదలుపెట్టిందని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెప్పుతుండడంతో కారు పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, ఇటు జనాల్లో కూడా హస్తం పార్టీపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు.


మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలన్నీ కర్ణాటకకు వెళ్లిపోతాయని, డీకే శివకుమార్‌ ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని బీఆర్ఎస్ అబద్ధాలు వ్యాప్తి చేస్తోంది. ఫేక్‌ లేఖలను సర్క్యులేట్ చేస్తూ కాంగ్రెస్‌ను దొబ్బకొట్టాలని చూస్తోంది. డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ సీఈఓకి లేఖ రాశారని, యాపిల్ ఎయిర్ పాడ్ తయారీ ప్లాంట్‌ను కంపెనీని బెంగుళూరుకు మార్చాలని కోరినట్లు కేటీఆర్‌ పదే పదే చెబుతున్నారు. అంతటితోనే ఆగకుండా త్వరలోనే తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ మార్చేస్తాం అని డీకే లేఖలో రాసినట్లు ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నమని విమర్శలు చేశారు కేటీఆర్‌. అయితే ఇదంతా డ్రామా. ఈ వార్తలపై స్పందించిన డీకే శివకుమార్ ఆ లెటర్ ఫేక్ అని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫేక్‌ లెటర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు,” అని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్‌పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మార్చడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×