నాంపల్లి నియోజకవర్గంలో లక్షకుపైగా బోగస్ ఓట్లు ఉన్నాయని.. వాటిని రద్దు చేసే ప్రక్రియ చేప్టటాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత హైకోర్టును ఆశ్రయించారు. మరణించిన, ఇళ్లు మారిన, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న ఓటర్లను ఎలక్షన్ కమిటీ తొలగించలేదని ఆరోపించారు. ప్రత్యేక సవరణ ద్వారా ఈ బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్ఖాన్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ జరిపింది.
ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తన వాదన వినిపించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ఖాన్కు సూచించింది. మరి కోర్టు సూచనల మేరకు బోగస్ ఓట్ల రద్దుపై ముందుకు వెళ్తారా? సీఈవోకు ఫిర్యాదు చేస్తారా? చేస్తే సీఈవో ఎలా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.