EPAPER

Telangana Elections : దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రచారం.. తెలంగాణ భవన్ లో ఈసీ అధికారులు..

Telangana Elections : దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రచారం.. తెలంగాణ భవన్ లో ఈసీ అధికారులు..

Telangana Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసింది. మైకులు బంద్ అయ్యాయి. ఇక రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం కార్యక్రమాలు నిర్వహించకూడదు. కానీ అధికార బీఆర్ఎస్ నేతలకు మాత్రం నిబంధలు పట్టలేదు. ఈసీ రూల్స్ ను అతిక్రమించారు.


తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు తెలంగాణ భవన్‌‌కు చేరుకున్నారు. ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. దీక్షా దివాస్ పేరుతో కార్యక్రమాలు చేపట్టడానికి పర్మిషన్ లేదన్నారు. ప్రచారం గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని అధికారులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ సిటి పోలిస్ కమిషనర్ సందీప్ శాండిల్య సహా అధికారులు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 144 సెక్షన్ అమల్లో ఉందని అధికారులు తెలిపారు.


.

.

.

Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×