Telangana DGP Suspension : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఫలితాలు వెలువడుతున్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లారు. ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక భద్రత కల్పించారు.
ఫలితాలు పూర్తిగా రాకముందే రేవంత్ రెడ్డిని డీజీపీ కలవడంపై కేంద్రం ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీని విధుల నుంచి తొలగించింది.