E-Paper
Advertisement

Telangana: కొత్త సచివాలయంలో తొలిసారి.. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ…

Telangana: కొత్త సచివాలయంలో తొలిసారి.. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ…
Advertisement

Telangana: తెలంగాణ కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు, ముఖ్యంగా జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో 21 రోజులపాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అమరవీరుల స్మృతి వనం రాష్ట్ర అవతరణ దినోత్సవల్లో ఏదో ఒక రోజు ప్రారంభించే అంశంపై తేదీని ఖరారు చేయనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడంతో వాటిపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏడు పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. అందులో కొన్ని బిల్లులపై నిర్ణయం తీసుకున్న గవర్నర్.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు తిప్పి పంపారు. అందులో ముఖ్యంగా పురపాలక నిబంధన చట్ట సాధన బిలు… ప్రైవేట్ యూనివర్సిటీలో చట్టం సవరణలో మార్పులు చేర్పులతో సమావేశాల్లో ఈ బిల్లులను పెట్టి గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. అంతేకాకుండా వైద్య విద్యలో HODల వయో పరిమితి బిల్‌ను గవర్నర్ తిరస్కరించి పంపారు. దీనిపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లులకు సంబంధించి రెండు మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కూడా కేబినేట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.

రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక ఫలితాలు తెలంగాణపై చూపే ప్రభావంపై చర్చించే ఛాన్స్ ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, పూర్తయిన పనులు ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచన తదితర అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×