Talasani: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర ఉమ్మివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బల్కంపేటలో మంగళవారం అమ్మవారి కళ్యాణం వేడుకగా జరిగింది. మంత్రి తలసాని సహా పలువురు వీఐపీలు, భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయితే.. గుడిలోకి వెళ్లేముందు.. అక్కడే ఉమ్మివేస్తూ ముందకు కదిలారు మంత్రి తలసాని.
ఆ దృశ్యం వీడియోకు చిక్కడం.. అది కాస్తా వైరల్ కావడం కలకలం రేపుతోంది. మంత్రి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు గుట్కా నమిలే అలవాటు ఉంది. రోజులో అనేకసార్లు గుట్కాలు తింటూనే ఉంటారు. తుప్ తుప్ మంటూ ఊంచుతూనే కనిపిస్తారు. అది ఆయన వ్యక్తంగతం అనుకున్నా.. ఇలా పవిత్రమైన ఎల్లమ్మ టెంపుల్ ముందే అలా ఊంచడం ఏమాత్రం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
తలసాని గుట్కా అలవాటుపై ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఘాటైన విమర్శలే చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజాజీవితంలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలని.. చూసే వాళ్లకు ఆదర్శంగా కనిపించాలని.. అలా గుట్కాలు నమలడం ఏంటని ప్రశ్నించారు. గుట్కాలు తినే నువ్వా.. నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. అలాంటిది ఇప్పుడిలా ఆటయం ముందు గుట్కా ఉమ్ముతూ వీడియోకు దొరికిపోవడం.. మంత్రి తలసాని ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేస్తోంది.