Swargaseema: ఒట్టేసి చెబుతున్నానంటూ మస్కా కొడుతున్నారు. స్వర్గసీమ పేరుతో నరకానికి నకలుని అంటగడుతున్నారు. అమాయకుల్ని బుట్టలో వేసుకుంటోంది స్వర్గసీమ యాజమాన్యం. జన సంచారంలేని ఏరియాలో సుకేతన వెంచర్ వేశారు. గజం 15వందల రూపాయలు కూడా పలకని చోట.. 10 వేలకే గజం అంటూ ప్రచారం చేస్తున్నారు. 33 శాతం డిస్కౌంట్, ఇప్పుడే కొనండని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. వెంచర్ క్లోజింగ్ ఆఫర్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ.. అమాయకులకు వల విసిరుతోంది సంస్థ యాజమాన్యం.
న్యూస్ పేపర్లు, ఎఫ్ఎం ఛానల్స్, టీవీల్లో చండ్ర చంద్రశేఖర్ చేసుకుంటున్న ప్రచారం మామూలుగా లేదు. కలర్ఫుల్ బ్రోచర్లతో కస్టమర్లను బోల్తా కొట్టిస్తూ.. అందమైన వేషాలు వేస్తూ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం మరోవైపు చేస్తున్నారు. అస్లు.. DTCP తుది అనుమతులు రాకుండానే సుకేతన వెంచర్లో ప్లాట్ల అమ్మకాలు చేపట్టడం చండ్ర చంద్రశేఖర్కే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి. జస్ట్ DTCPకి పెట్టుకున్న దరఖాస్తునే అప్రూవల్గా చూపించుకుంటున్నాడు చండ్ర చంద్రశేఖర్. మరోవైపు పూర్తి లేఅవుట్కు నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు అంటగడుతోంది స్వర్గసీమ యాజమాన్యం. మొత్తం లేఅవుట్కు నాలా కన్వర్షన్ ఎందుకు చేయలేదనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ధరణిలో బైనెంబర్లతో అనుమానాస్పదంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. రూల్స్కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? చెరుకుపల్లిలో చండ్ర చంద్రశేఖర్ మాయలు అన్నీ ఇన్నీ కావు.
కస్టమర్ల అమాయకత్వమే పెట్టుబడి. మాటలతో మస్కా కొట్టించడమే వ్యాపారం. అంతా పక్కాగా ఉంటే, ఇప్పటికీ చాలా భూమి అగ్రికల్చర్ ల్యాండ్గా ఎందుకుంది? ఏ ప్లాట్.. ఏ సర్వే నెంబర్లో ఉందో.. ఎందుకు పక్కాగా చెప్పడం లేదు? ప్రతీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో.. అన్ని సర్వే నెంబర్లూ ఎందుకు వేస్తున్నారు? భవిష్యత్లో ఎవరైనా ఈ భూమి మాది అంటే.. ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితేంటి? కొన్ని ప్లాట్లే మిగిలి ఉంటే ఇంత భారీ ప్రచారం దేనికి? గెటప్లు వేసి ప్రకటనలు ఇవ్వడం వెనుక మర్మం ఏంటి? కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసేంత లాభాలు.. సుకేతన వెంచర్ ద్వారా వస్తున్నాయా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగానే ఉంటున్నాయి. సుకేతన వెంచర్లో నిబంధనల ఉల్లంఘన అంటూ ఇప్పటికే రెరా కూడా నోటీసులు జారీ చేసింది. మరి..యాజమాన్యం ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు?
.
.