EPAPER

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.


జస్టిస్ అలోక్ అరదే మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్ర ఆమోదం లభించగానే జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారు. 2013లో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మణిపూర్‌ హైకోర్టు ప్రధానమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు చేసింది.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×