Inter Student Commits Suicide(Local news telangana): ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరికి జిల్లాకు చెందన బాపురాజు, ఎం.మహాలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు కృష్ణవేణి (19) రెండేళ్ల క్రితం ఏపీలోనే ఇంటర్ చదివింది. అయితే ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ మిగలడంతో.. ఏప్రిల్ లో సప్లిమెంటరీ రాయాల్సి ఉంది.
ఈ క్రమంలో రెండేళ్ల క్రిందట బాపురాజు కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్ లోని స్థానిక వసంతనగర్ లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15న కృష్ణవేణికి పరీక్షలు ఉండటంతో ఆమె తల్లి దండ్రులు బాగా చదువుకోమని సూచించారు. ఓ వైపు ఎక్జామ్స్ భయం, మరో వైపు తల్లి దండ్రులు బాగా చదవమని హెచ్చరించడంతో ఆందోలనకు గురైన కృష్ణవేణి..
Read more: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!
ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తాము నివాసముంటున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కృష్ణవేణిని ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతిరాలి తల్లి మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వారు ఉన్న కాలనీ సీసీ టీవీలో రికార్డ్ కాగా , ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ – బాచుపల్లిలో ఉంటున్న కృష్ణవేణి(19) అనే అమ్మాయి రెండేళ్ల క్రితం ఏపీలో ఇంటర్ చదివింది.. ఒక పరీక్షలో తప్పడంతో ఏప్రిల్లో సప్లిమెంటరీ రాయాల్సి ఉండగా ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్… pic.twitter.com/Eegpjj0L7c
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2024