IIIT Basara : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్కుమార్ హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బైంసా ఆసుపత్రికి తరలించారు.బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ కుమార్ స్వస్ధలం నాగర్ కర్నూల్ గా గుర్తించారు.