EPAPER

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్లుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు బ్రిడ్జీ పై నుంచి కిందపడిపోయి స్పాట్‌లోనే మరణించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.


ఇదిలా ఉండగా రాయదుర్గంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎర్రగడ్డ నుంచి మోయినాబాద్‌కు వెళ్లుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Also Read: అందరూ ఆల్ రౌండర్లే: భారత కోచ్ సాయిరాజ్


గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పైనా ఇలాగే బైక్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లుతుండగా ఆ బండి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్, ఉద్యోగం వెతుకుతూ వచ్చిన బాల ప్రసన్నలుగా మృతులను గుర్తించారు. మసీద్ బండ నుంచి హఫీజ్ పేట్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×