Telangana MLC post vacant : తెలంగాణ శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే గవర్నర్ కోటాలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు నలుగురు ఎమ్మెల్సీలు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
Telangana MLC post vacant : తెలంగాణ శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే గవర్నర్ కోటాలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు నలుగురు ఎమ్మెల్సీలు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు.
ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగరు ఎమ్మెల్సీలు.. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ పదవికాలం 2027 మార్చి వరకు ఉంది. అలాగే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.