Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ మండల కేంద్రంలో ఆటో, బైకును.. డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం సంత కావడంతో సరుకుల కోసం మోతి ఘనాపూర్ గ్రామ వాసులు బాలనగర్ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.