Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27 న యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఇంధనశాఖ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలపై అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరింది.
కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని కాబట్టి వాయిదా వేయాలని ఇంధన శాఖ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని తీర్పించ్చింది.