YS Sharmila latest news(Telangana politics) : గులాబీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. BRSలో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమా వెంకటేశ్వర్లులే అని విమర్శించారు. అంతా ఎన్నికల కమీషన్ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని దుయ్యబట్టారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలని ధ్వజమెత్తారు.
ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే.. దాచింది కొండంతని షర్మిల ఆరోపించారు. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం ఉన్నాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి, అధికారం అనుభవిస్తున్న వారిని ఎన్నికల పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల.