Murder: శంషాబాద్లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య కేసు చేధించారు పోలీసులు. మృతురాలిని శంషాబాద్ మండలం రాళ్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం కడుపునొప్పి వస్తుందని..శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది మంజుల. ఆస్పత్రికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆరా తీశాడు. భార్య ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంజుల భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా నిర్ధారించారు పోలీసులు. మంజుల మెడలో తాళి బొట్టు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు లేవని గుర్తించారు కుటుంబ సభ్యులు. వాటి కోసమే ఆమె హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు పోలీసులు. స్థానికంగా ఉండే రిజ్వనాబేగంకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది మంజుల. ఇచ్చిన అప్పు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో మంజులను హత్య చేసింది రిజ్వానా. మంజుల కళ్లల్లో కారం చల్లి..చీరకొంగుతో ఉరిపెట్టి మంజులను హత్య చేసింది రిజ్వానాబేగం. హత్య చేసిన అనంతరం మంజుల మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిందని పోలీసులు వెళ్లడించారు.