ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ జనంలోకి వెళ్లారు. కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడే క్రమశిక్షణ తప్పారు. కాంగ్రెస్ నేతలను కాల్చి పడేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్ చేసిన ఆ నాయకుడు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలకపల్లి మండలం బొప్పలిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనకు పిచ్చి లేస్తే.. కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తానంటూ హెచ్చరించారు.
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే ఎందుకంత అసహనంతో ఊగిపోయారనే చర్చ నడుస్తోంది. ఓటమి భయంతో బెదిరింపులకు దిగుతున్నారనే అనుమానం కలుగుతోంది. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.