Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఓ మెస్లో పని చేస్తుంది. అదే మెస్లో పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లినట్టు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.