Warangal News : కుమార్తె ప్రేమపెళ్లి చేసుకుందనే కోపంతో.. యువకుడి ఇంటితో పాటు సహకరించిన మరో ఇద్దరు యువకుల ఇళ్లను తగలబెట్టేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లిలో జరిగింది.
గ్రామ సర్పంచి కూమార్తె కావ్య శ్రీ.. అదే గ్రామానికి చెందిన రంజిత్.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో.. పెళ్లి చేసేసుకున్నారు.
పెళ్లి విషయం తెలిసి.. పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. రమ్మని ఎంత బతిమాలినా కుమార్తె వెళ్లకపోవడంతో.. తండ్రి కోపం పెట్టుకున్నాడు. రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు మిత్రుల ఇళ్లకు నిప్పంటించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.