Sanjeeva Reddy : నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలన్నదే ఆయన లక్ష్యం. 2016 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మూడో ప్రయత్నంలో మాత్రంలో విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్ధి పట్లోళ్ల సంజీవ్ రెడ్డి. అందుకే గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలో ఎక్కడా చూసిన కాంగ్రెస్ ప్రభంజనమే కనిపిస్తోందని సంజీవ్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమానంగా ఈసారి కాంగ్రెస్ విజయాన్ని ఇస్తామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు తెలంగాణగా ఉందన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని సంజీవ్ రెడ్డి అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు.
నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను, యువతను మభ్యపెట్టిందని సంజీవ్ రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ ఎక్కడ ఇవ్వడంలేదన్నారు.
ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడానికి రెడీ గా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈ సారి నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.
.
.