Sajjanar: ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోమవారం కృష్ణానగర్ వద్ద 6ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్-7 ఫైనల్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణన జరిగింది.
ఈ ఘర్షనలో కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. బస్సులను ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానానికి చేరుతాయన్నారు. అలాంటి బస్సులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనార్ అన్నారు.
.
.