రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని ఎఈఒ పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు.
Rythu bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకం సక్రమంగా సాగుతుంది. ఇందుకు పట్టా పాసుపుస్తకం ఉంటె దీనికి అర్హులు అవుతారు. ఈ పథకానికి పరిమితులు ఏం లేవు. గిరిజనులకు కల్పించన హక్కు పత్రాలతో సైతం అన్ని రకాల భూములకు ఈ పథకం అందుతుంది. దీనిపై జరుగుతున్న పరినామాలను అన్నింటిని దృష్టిలోకి తీసుకుని ఓ (ఎఈఒ) సీఎం కేసిఆర్ కు లేఖ రాశారు.
రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని, వ్యవసాయ విస్తరణ అధికారి (ఎఈఒ)గా పని చేస్తున్న కాటెపెల్లి పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు. అందులో వివరాలు గమనిస్తే, రాష్ట్ర ప్రభూత్వం ఈ పథకాన్ని 5 ఎకరాల రైతులకే అందేలా పరిమితి పెట్టాలని, మిగితా డబ్బును రైతులు పోలాలకు వెళ్ళడానికి కాళి నడక దారులకు కేటాయించాలని అందులో పొదుపరిచారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో పని చేస్తున్న ఎఈఒ , లేఖను మంగళవారం రోజు తపాలా ద్వార ప్రగతి భవన్ కు పంపించారు.
2023 నూతన సంవత్సరంలో కూడ ఈ పథకం కింద రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకాన్ని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే, పరిమితం కావాలని అడిగితెనె సీఎం తనను పార్టీ నుండి బహిస్కరించారని, ప్రస్తుత బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజెందర్ అరోపణలు కూడ వినిపించాయి. ప్రతిపక్ష నాయకులు గట్టి పట్టుతో కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడుతునే ఉన్నారు.