EPAPER

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?
  •  ఆర్టీసీ ఎంసీ సజ్జనార్ ఆగ్రహం
  • ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, స్వేచ్ఛ: షాద్ నగర్ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. ఫుడ్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదెవరని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్‌లో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సజ్జనార్‌కు లేఖలో వివరించారు విద్యార్థులు గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ 35 కిలోమీటర్ల బస్ పాస్ పరిమితి సరిపోవట్లేదని లేఖలో వివరించారు. డిగ్రీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని కోరారు. షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్‌లో పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌ను కోరారు.


స్పందించిన సజ్జనార్

షాద్ నగర్ విద్యార్థుల సమస్యల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న మీడియా కథనాలపై రియాక్ట్ అయిన ఆయన, ఈ సమస్య మీద ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు.


కాసుల పంట
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండింది. బతుకమ్మ, దసరా పండుగల్లో కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు జనం. అక్టోబర్ 1 నుండి 15 తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. దీనివల్ల రూ.307.16 కోట్ల ఆదాయం వచ్చింది. రెగ్యులర్‌గా తిరిగే సాధారణ సర్వీసులు కాకుండా 10,513 ఎగస్ట్రా బస్సులు నడిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ కూడా మహిళలలకు ఉండటంతో బాగా కలిసి వచ్చింది అంటున్నారు అధికారులు.

Related News

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

CP CV ANAND : ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు, ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్

Deputy CM Bhatti: ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్‌తో భేటీ, కుల గణన సర్వేపై

KTR Vs Konda Surekha: అలా మాట్లాడొద్దు.. కొండా సురేఖకు కోర్టు ఆదేశాలు

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Big Stories

×