EPAPER

RTC Bus Collided with Car: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీ!

RTC Bus Collided with Car: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీ!

Bus accident in telangana today(): హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు కారు వస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం‌కు బస్సు వెళ్తున్నట్లు తెలుస్తోంది.


ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం వాసుదేవ్పూర్ గేటు సమీపంలో జరిగింది. ప్రమాదానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతులు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ వాసులుగా గుర్తించారు. 35 ఏళ్లగా శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, నిఖిల్‌(26), మణిదీప్ (25) అందులో ఉన్నారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.


Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×