KCR (latest news in Telangana): సీఎం కేసీఆర్ కాన్వాయ్లోకి మరో కారు వచ్చి చేరింది. కొత్తగా ల్యాండ్ క్రూజర్ను కొనుగోలు చేశారు. ఈ కారుకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ నుండి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో వచ్చిన కేసీఆర్ కాన్వాయ్ కొత్త కారుకు కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్ లో 15 కార్లు, ఒక అంబులెన్స్ ఉంది. తాజాగా ల్యాండ్ క్రూజర్ రావడంతో కాన్వాయ్ లోని కార్ల సంఖ్య 16కు చేరింది.
కొత్తగా తీసుకున్న ల్యాండ్ క్రూజర్ ప్రాడో వాహనం ఖరీదు 2 కోట్లకుపైగానే ఉంటుంది. కాన్వాయ్ పేరుతో కేసీఆర్ ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని గతంలో విపక్ష నేతలు విమర్శలు చేశారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నాటి కాన్వాయ్ వాహనాలను మార్చి కొత్త వాహనాలు తీసుకున్నారు కేసీఆర్. భద్రతా పరంగా స్పెషల్ గా డిజైన్ చేసారు.