EPAPER

Revanth Tweet : రైతుబంధు పై రేవంత్ ట్వీట్.. అధికారంలోకి రాగానే రూ.15 వేలు

Revanth Tweet : రైతుబంధు పై రేవంత్ ట్వీట్.. అధికారంలోకి రాగానే రూ.15 వేలు

Revanth Tweet : ఎన్నికల కమిషన్ రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి X వేదికగా స్పందించారు. “రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం.” అని రేవంత్ వెల్లడించారు.


మరో ట్వీట్ లో పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని.. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ జోక్యం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.

.


.

.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×