Revanth Reddy Tweet : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కోరారు.