Revanth Reddy: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాపై సెటైర్లు వేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. తాను చేసిన సవాల్ను స్వీకరించకుండా కేసీఆర్ పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండువంతుల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్లో ఓడిపోతానని సీఎం కేసీఆర్ ఫిక్స్ అయ్యారని.. అందుకే కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. అయితే, ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.
గతంలో కేసీఆర్కు తాను విసిరిన సవాల్ను ఆయన స్వీకరించలేదని.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వలేదని అన్నారు. తాను చెప్పినట్టే కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోయారని.. మైనార్టీ నేత షబ్బీర్ అలీ చేతిలో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు.
బీఆర్ఎస్ జాబితా చూశాక.. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్దేనని తేలిపోయిందన్నారు రేవంత్రెడ్డి. కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని అన్నారు.