Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాదాపు నెలరోజులపాటు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోజూ కనీసం మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయభేరి సభలకు హాజరయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు కాస్త సమయం దొరికింది.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సర్వమత ప్రార్థనలు చేశారు. మాణిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ , మల్లు రవితో కలిసి మొదట బిర్లా టెంపుల్కి వెళ్లారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు జరిపారు. మరోవైపు నాంపల్లి దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు.