Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని అక్షిత పాముకాటుకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టాయిలెట్ కోసం వెళ్లిన విద్యార్థినిని… పాము.. మూడు చోట్ల కాట్లు వేయటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఊహించన ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
పాఠశాలలో పరిశుభ్రత లేదని..పిచ్చిమొక్కలు ఉండటం వల్ల దుర్గంధం, దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చదువుకుందామని స్కూలుకి వెళ్తున్న పిల్లలు పాము కాటుకు గురై ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వందల కోట్ల స్కూళ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దానికి ఉదాహరణే షాద్ నగర్ ఘటన