KCR : సీఎం కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందా? కాళేశ్వరం లోపాలు బయటపడడంతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నారా? గెలుపు కోసమే రాజశ్యామల యాగం చేస్తున్నారా? యాగాలు చేస్తే ఎన్నికల్లో గెలుస్తారా? ఈ అంశాలే ఇప్పుడు అటు BRS శ్రేణుల్లోనూ, ఇటు తెలంగాణలోనూ చర్చనీయాంశమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న కేసీఆర్… మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో ప్రచారంలో కాళేశ్వరం ఊసే ఎత్తడం లేదు. పైగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో విజయం కోసం యాగాలు చేస్తున్నారు.
విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ యాగం చేయడంపై ఆసక్తి రేపుతోంది. యాగం చేయాలని కేసీఆర్ చాలా సడన్గా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు… ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానంటూ కొత్త పాట అందుకున్నారు.
మరోవైపు, ప్రచారం జోరుగా సాగుతుంటే ఎమ్మెల్సీ కవిత హడావిడి అస్సలు కనిపించడం లేదు. కవితను కావాలనే ప్రచారం నుంచి పక్కన పెట్టారా? లేక కవిత ప్రచారంలో పాల్గొంటే లిక్కర్ కేసే కనిపిస్తుందన్న భయంతోనే ఆమెను దూరం పెట్టారా? అనే చర్చ జరుగుతోంది.