Rahul Gandhi : తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ షెడ్యూల్లో మరోసారి చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ వీ పార్క్ హోటల్ నుంచి గంగాధర మీదుగా జగిత్యాలకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
అయితే షెడ్యూల్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం ఉండగా.. చివరి నిమిషంలో టెంపుల్ విజిట్ను రద్దు చేసుకున్నారు. నేరుగా జగిత్యాలకు వెళ్లిన రాహుల్ గాంధీ.. మార్గమధ్యంలో నూకపల్లి వద్ద ఆగి స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే నూకపల్లిలో టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం మీదుగా బాల్కొండ నియోజకవర్గంలోకి రాహుల్ బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని.. అనంతరం ఆర్మూర్ సభకు వెళ్తారు.