EPAPER

Rahul Gandhi : తెలంగాణలో పొత్తులపై రాహుల్ గాంధీ క్లారిటీ..

Rahul Gandhi : తెలంగాణలో పొత్తులపై రాహుల్ గాంధీ క్లారిటీ..

Rahul Gandhi : తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తో ఎలాంటి అవగాహన లేదని రాహుల్‌గాంధీ స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ పొత్తులపై స్పష్టత నిచ్చారు.


వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని రాహుల్ జోస్యం చెప్పారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోరాటంపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటా భారత్‌ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×