Raghunandan Rao : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపింపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పై 2008 సంవత్సరంలో సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.
తిరిగి వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఆయకట్టు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు అందించాలని మార్చిలోనే కాగ్ లేఖ రాసిన ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భారీ అవినీతికి పాల్పడ్డారని అందుకే నివేదికలు సమర్పించలేదని ఆరోపించారు.
దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ రఘునందన్ రావు చేశారు.