EPAPER

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP Press Meet: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


పీర్జాదిగూడలో నాలుగు రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అయితే ఆమెకు సంబంధించినన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. అయితే ఇప్పటికే ఈ ముఠా 16 మంది చిన్నారులను విక్రయించినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభరాణి, సలీం, స్పప్నలను అరెస్టు చేశాం అని సీపీ చెప్పారు. సంతానం లేని వారికి వీరు పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.


Also Read: ఆర్టీవో ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని భారీ నగదు

ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముఠాకు సంబంధించి ఢిల్లీ, పుణెలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ముఠా తల్లిదండ్రల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×