GHMC news today telugu(TS news updates): వర్షాలు హైదరాబాద్ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఇక మురుగు కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు మరోవైపు పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒక చోటుచేసుకుంది.
అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. జీహెచ్ఎంసీ అధికారులకు అక్షయ్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా కూడా సిబ్బంది పట్టించుకోలేదు. అంతే ఆ యువకుడికి బీభత్సమైన కోపం వచ్చింది. పామును జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయానికి తెసుకొచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్పై పామును పెట్టి నిరసన వ్యక్తం చేశాడు.
పాము విషయం కలకలం రేపడంతో అప్పటికిగాని GHMC సిబ్బంది స్పందించలేదు. బాధితుడి ఇంటి దగ్గర ఉన్న పొదల కారణంగా పాములు వస్తున్నాయని గుర్తించి వాటిని తొలగించారు.