President Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఐదు రోజుల శీతాకాల విడిది కోసం ఈరోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్నారు. దుండిగల్ లోని ఎయిర్ఫోర్స్ విమానాశ్రయంలో దిగనున్న రాష్ట్రపతికి.. ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్, మంత్రులు.. పలువురు అధికారులు స్వాగతం పలకనున్నారు. కాగా 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించనున్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. అలానే ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేయనున్న క్రమంలో.. రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
.
.