E-Paper
Advertisement

Ponguleti : కాంగ్రెస్ సభకు ఆటంకాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్..

Ponguleti : కాంగ్రెస్ సభకు ఆటంకాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్..

Ponguleti : ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి విమర్శించారు. రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

ఖమ్మం సభకు జనం భారీగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే రాత్రి నుంచి 1700 వాహనాలు సీజ్ చేశారని చెప్పారు. ప్రైవేట్ వాహనాలలో జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే కాంగ్రెస్ సభను సక్సెస్ కాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అయినా సరే బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ జనగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షల మందివస్తారని పేర్కొన్నారు.

సభకు వెళితే సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రజలను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రైతు బంధు ఆపేస్తామని రైతులను భయపెడుతున్నారని మండిపడ్డారు. పోడు భూములు పట్టాలు ఇస్తామని గిరిజనులను ప్రలోభపెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుంచే మొదలవుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.

Tags

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×