Polling has Ended in Naxal Affected Area’s: తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది.
నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
అదేవిధంగా ఏపీలో కూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పాడేరు, అరకు, రంపచోడవరంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న ఓట్లరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మిగతా చోట్లా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది.
Also Read: Bihar: తొలిసారిగా ఓటు వేస్తున్నానంటూ దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు
అయితే, ఈ నియోజకవర్గాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలు సజావుగా జరిగేలా నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.