Politicians Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,665 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మండలం పోలింగ్ బూత్ లో తుమ్మల నాగేశ్వర రావు ఓటు వేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి నారాయణపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఓటు వేశారు.పువ్వాడ అజయ్, చల్లా ధర్మారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి ఓటు వేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ పర్వతగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లో వినోద్ కుమార్, వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలో ఓటు వేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో కల్వకుంట్ల కవిత ఓటు వేశారు. బర్కత్పురలో కిషన్రెడ్డి, అంబర్పేట్లో డీజీపీ అంజనీకుమార్,శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బోయిన్పల్లిలో మల్లారెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి సంగారెడ్డి నారాయణఖేడ్లో తమ ఓటు వేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి కౌడిపల్లి పోలింగ్ బూత్ లో, గజ్వేల్లో తూంకుంట నర్సారెడ్డి ఓటు వేశారు. సిద్దిపేట బొప్పాపూర్లో రఘునందన్రావు, మెదక్ కోనాపూర్లో పద్మదేవెందర్రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ జడ్పీహెచ్ఎస్ లో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అంతకుముందు గోమాతకు పూజ నిర్వహించారు.
.
.