EPAPER
Kirrak Couples Episode 1

Etela: ఈటలకూ నోటీసులు.. బీజేపీనే టార్గెటా?

Etela: ఈటలకూ నోటీసులు.. బీజేపీనే టార్గెటా?
Etela Rajender notice

Etela: ఈ పోలీసులు ఉన్నారే.. టెన్త్ పేపర్ లీక్ కేసును పక్కా పొలిటికల్ కేసుగా మార్చేస్తున్నారు. పేపర్ బయటకు వచ్చిన కొన్నిగంటల్లోనే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి.. ఆయనే ఏ1 అంటూ కేసు పెట్టి.. జైలుకు పంపించారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చి.. విచారణకు రమ్మని పిలిచారు.


ఇంతకీ ఈటల చేసిన తప్పేంటంటే.. ఆయనకు కూడా వాట్సాప్‌లో పేపర్ రావడం. ఏ2 ప్రశాంత్ అనేక మందికి టెన్త్ పేపర్ సెండ్ చేశాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. వారిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటల పీఏలకు కూడా పేపర్ పంపించారు. అయినా, ఆయనపై తామేమీ కేసు పెట్టలేదంటూ బుధవారం ప్రెస్‌మీట్లో క్లారిటీ ఇచ్చారు సీపీ.

కట్ చేస్తే, గురువారం కల్లా సీన్ మారిపోయింది. ఎక్కడినుంచి ఆదేశాలు వచ్చాయో కానీ.. ఈటల రాజేందర్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. 160 సీఆర్‌పీసీ విట్నెస్ కింద నోటీసు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో తెలిపారు.


తానేం తప్పు చేశానని తనకు నోటీసులు ఇచ్చారంటూ ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. తనకు వాట్సాప్ అంటే ఏంటో కూడా తెలీదని.. తన ఫోన్లను పీఏలే హ్యాండిల్ చేస్తారని చెప్పారు. తనకెవరో ఏదో పంపించినంత మాత్రాన విచారణకు పిలుస్తారా? అని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు రాజేందర్.

పేపర్ లీక్ ఘటనలో ఈటలపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం గట్రా చేయకపోయినా.. ఇలా నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచి.. బీజేపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమే బీఆర్ఎస్ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు కమలనాథులు.

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×