Hyderabad News : 10 మందికి చెప్పాల్సిన పోలీస్ అధికారే తప్పతాగి యాక్సిడెంట్ చేశాడు. హైదరాబాద్ బొల్లారంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. మద్యం మత్తులో కూరగాయల లోడ్ వాహనాన్నిఢీ కొట్టాడు. రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది.
స్థానికుల సమాచారంతో స్పాట్కు చేరుకున్నారు పోలీసులు. సీఐకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే.. 210 రీడింగ్ వచ్చింది. తాను ఏసీపీనని స్థానికులను, పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు ఆ సీఐ.
యాక్సిడెంట్ చేసిన సీఐ శ్రీనివాస్ వాహనంపై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఐ విధులు నిర్విహిస్తున్నారు.
మరి, పోలీసులు కేసు నమోదు చేస్తారా? మనోడే కదాని లైట్ తీసుకుంటారా? తాగి కారు నడిపి.. యాక్సిడెంట్ చేసి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్?