Sunil: బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీమ్ హెడ్ సునీల్ కనుగోలు ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. మాదాపూర్ లోని కార్యాలయం నుంచి ఉద్యోగులను బయటకు పంపించేశారు. కంప్యూటర్లను సీజ్ చేశారు. ఆఫీసుకు సీల్ వేశారు.
పోలీసుల వచ్చిన సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు సునీల్ ఆఫీసులోనే ఉన్నారు. పోలీసులతో టికాంగ్ నాయకులు వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ మండిపడ్డారు. అయినా, పోలీసులు వారందరినీ బయటకు పంపించేసి తనిఖీలు పూర్తి చేశారు.
సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారనేది సునీల్ కనుగోలు మీద ఉన్న ఆరోపణ. ఫేక్ సోషల్ మీడియా ఐడీలతో.. ఫేక్ పోస్టులు పెడుతున్నారనే కేసులో సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు.