Revanth Reddy : హైదరాబాద్ గన్పార్కు వద్ద వాతావరణం హీటెక్కింది. ప్రలోభాల పర్వం లేకుండా ఎన్నికలకు వెళ్దామంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఛాలెంజ్లోభాగంగా ప్రమాణం చేయడానికి అమరవీరుల స్థూపం వద్దకువెళ్లిన టీపీసీసీ చీఫ్ను పోలీసులు అడ్డుకున్నారు.
ఎన్నికల కోడ్ ఆంక్షలు ఉండటం వల్ల అనుమతి లేదని పోలీసులు రేవంత్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రమాణం చేసి వెళ్తానంటూ పట్టుబట్టారు.దీంతో పోలీసులకు రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్ కు మద్దతుగా భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళన చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు వ్యాన్లో ఎక్కించారు. అక్కడి నుంచి గాంధీభవన్కు తీసుకెళ్లారు. అయితే ఈ ఉద్రిక్తతలతో అమరవీరుల స్థూపం వద్ద భారీగా ట్రాఫిక్ అయింది. కొద్దిసేపటి తర్వాత రేవంత్ ను పోలీసులు విడుదల చేశారు.