EPAPER

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?  లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్

MP Laxman Comments On Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చరిత్ర హీనులుగా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిపోకూడదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చూస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుస్తుందని అన్నారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ చాలా సార్లు ప్రస్తావించారని తెలిపారు. ప్రస్తుతం ఏ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడిందని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని తెలిపారు.


Also Read:  ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి, డీటేల్స్ కావాలంటూ…

బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌పై  కేసీఆర్ అక్రమ కేసులు పెట్టించారని  ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసం బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దర్మార్గం అని అన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

Related News

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Big Stories

×