TSPSC : TSPSC కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ విచారణపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తంచేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని కోరారు. కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
TSPSC పేపర్లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇప్పటికే కేసులో 100 మందినిపైగా సిట్ అరెస్ట్ చేసింది. హైకోర్టులో బక్క జడ్సన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐతోనే నిష్పాక్షిక విచారణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.