Patancheruvu : పటాన్ చెరులో చెరువల కబ్జా వ్యవహారంపై బిగ్ టీవీ కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. శంభుని కుంట చెరువు కబ్జాపై బిగ్ టీవీలో చెరువు దొంగల పేరుతో కథనం ప్రసారమైన వెంటనే ఇరిగేషన్ ఏఈ హడావుడిగా కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు.
తాజాగా పోలీసుశాఖ కూడా రంగంలోకి దిగింది. మట్టిని తరలించేందుకు వినియోగించిన వాహనాలను అమీన్ పూర్ పోలీసులు పట్టుకున్నారు. మిగతా వాహనాలను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బిగ్ టీవీ రిపోర్టర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి టిప్పర్ల వీడియోలు తీస్తుండగా ఓ కానిస్టేబుల్ అడ్డుకోడానికి ప్రయత్నించారు. అనుమతి లేకుండా వీడియోలు ఎలా తీస్తారంటూ వాగ్వాదానికి దిగారు.
ఎస్ఐ కిష్టారెడ్డిని అనుమతి కోరగా వీడియోలు తీస్తే మిగతా వారు అలర్ట్ అయి పరారీలో ఉంటారని చెప్పడం, మరిన్ని వాహనాలను స్వాధీనం చేసుకుని వివరాలను విలేకరుల సమావేశం పెట్టి వివరిస్తామని చెప్పారు.
ఎన్ని వాహనాలను వివరాలు ఇంకా తెలియదని ఎస్ఐ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది . మరోవైపు వాహనాలకు సంబందించిన యజమానులు సదరు ఎస్ఐ కి ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు. వాహనాలను రిలీజ్ చేయాలని కోరుతున్నట్టు సమాచారం.
ఏదేమైనా శంభునికుంట పూడ్చివేతలో పెద్ద తలకాయలే ఉండడం, వారికి పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. కానిస్టేబుల్ ఓవర్ యాక్టింగ్ చూస్తే సందేహాలు బలపడుతున్నాయి.
శంభుని కుంటకు అక్రమార్కుల చర నుంచి విముక్తి కలుగుతుందా.. లేక ఇది కూడా మిగిలిన చెరువుల మాదిరిగా కబ్జాల చెరలో మిగిలిపోతుందనా అనేది తేలాల్సి ఉంది.