MLA Yashaswini Reddy : గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని నారాబోయిన గూడెం గ్రామంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడలను ఆమె ప్రారంభించారు. సేవాలాల్ సేన ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి.. కబడ్డీ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోని నైపుణ్యాలను వెలికితీయడానికి కృషి చేయాలన్నారు.
MLA Yashaswini Reddy : గ్రామీణప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని నారాబోయిన గూడెంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఆమె ప్రారంభించారు. సేవాలాల్ సేన ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి.. కబడ్డీ నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలోని నైపుణ్యాలను వెలికితీయడానికి కృషి చేయాలన్నారు.
పోటీలను ప్రారంభించిన అనంతరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ ఇళ్లు పరిశీలించారు యశస్వినిరెడ్డి. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండా వదిలేసిందని విమర్శించారు. దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హామీ ఇచ్చారు.