Palakurthy Congress Meeting : పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభకు జనం పోటెత్తారు. ఈ సభలో ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిచిచారు. అలాగే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ దోపిడి కనిపిస్తోందని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో వనరులన్నీ తనకే కావాలనుకుంటున్నారని ఆరోపించారు. అందరి పోరాటల వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరీకీ న్యాయ జరగాలన్నదే తన తాపత్రయమని కోదండరాం అన్నారు. కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
పాలకుర్తి ప్రజలనే తాము నమ్ముకున్నామని హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు మిగిలేది ఆయన కుటుంబం ఒక్కటేనని స్పష్టం చేశారు. తాము ప్రజాసేవ కోసమే వచ్చామన్నారు. కానీ ఎర్రబెల్లి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
40 ఏళ్లుగా తన అత్తమామలు ఝాన్సీరెడ్డి, రాజేంద్రరెడ్డి ప్రజా సేవ చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి వివరించారు. కానీ అభివృద్ధిని ఎర్రబెల్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆ అభివృద్ధి కొనసాగాలంటే అధికారం కావాలన్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరామని తెలిపారు. కాంగ్రెస్ తోనే బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని యశస్విని రెడ్డి కోరారు. దగా కోర్ దయాకర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. తన అత్త ఝాన్సీరెడ్డికి భారత్ పౌరసత్వం రాకుండా ఎర్రబెల్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. కానీ వారసత్వంతో తాను పోటీకి దిగానని స్పష్టం చేశారు.
యువత ప్రతినిధిగా రాజకీయాల్లో మార్పుకోసం వచ్చానని యశస్వినిరెడ్డి చెప్పారు. 1200 బిడ్డలు ఆత్మబలినాలతో తెలంగాణ వచ్చిందని నేడు అది కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. మోసంకారి కేసీఆర్ ను గద్దె దించే పనిలో ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు.
.
.
.