EPAPER

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయింది. కొడుకుతో గొడవపడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది.


ఈ క్రమంలో 20 రూపాయల కోసం కొడుకుతో గొడవపడింది. అతను చేయి చేసుకోవడంతో ఆమె కింద పడిపోయింది. స్థానికులు వారి మధ్య గొడవను ఆపారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోయింది. ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మహిళ మరణానికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×